మాజీ భార్యతో ధనుష్ పోటీ

ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య విడిపోయారు. లీగల్ గా విడాకులు తీసుకోలేదు కానీ కలిసి ఉండడం లేదు. విడిపోయామని ప్రకటించారు. ఇప్పుడు వీళ్లిద్దరూ సంక్రాంతి పండగకి తమ సినిమాలతో పోటీ పడుతున్నారు.

ధనుష్ నటిస్తున్న “కెప్టెన్ మిల్లర్” చిత్రం డిసెంబర్ 15 నుంచి వాయిదాపడి సంక్రాంతికి విడుదల అవుతోంది. ఇక ఐశ్వర్య యువ హీరో విష్ణు విశాల్ తో ఒక మూవీ డైరెక్ట్ చేస్తోంది. “లాల్ సలామ్” అనే ఈ చిత్రంలో ఆమె తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది.

ధనుష్ సినిమా సంక్రాంతికి షిఫ్ట్ కావడంతో “లాల్ సలామ్” సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది అని ప్రచారం జరిగింది. కానీ, తమ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ఐశ్వర్య, ఆమె టీం తాజాగా ప్రకటించింది. అంటే, మాజీ భార్య సినిమాతో ధనుష్ ఈ పండగకి పోటీ పడాలి.

ధనుష్ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇక ఐశ్వర్య చిత్రంలో ఆమె తండ్రి రజినీకాంత్ ఉన్నాడు కాబట్టి దానికి కూడా పాన్ ఇండియా క్రేజ్ ఉంటుంది. మరి ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Advertisement
 

More

Related Stories