మహేష్ చిత్రంలో మీనాక్షి!

త్రివిక్రమ్ మూవీ అంటే ఇద్దరో ముగ్గురో హీరోయిన్లు ఉండాల్సిందే. మెయిన్ హీరోయిన్ తో పాటు చిన్న పాత్రకో, పాటకోసమో మరో హీరోయిన్ ని తీసుకుంటారు త్రివిక్రమ్. అది ఆయన ట్రేడ్ మార్క్. తాజాగా ఆయన మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా ఒక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా షురూ కాలేదు. కానీ, కాస్టింగ్ పనులు జరుగుతున్నాయట.

హీరోయిన్ గా పూజ హెగ్డేని తీసుకున్నామని ఇంతకుముందే ప్రకటన వచ్చింది. ఆమెని వరుసగా మూడోసారి తన సినిమాలో రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఇందులో మరో పాత్ర కోసం మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు టాక్. ఈ భామ ఇటీవల “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే చిత్రంలో నటించింది.

ఆమె నటించిన తొలి మూవీ ఆడలేదు. అలాగే, ఆమె నటన కూడా చెప్పుకోదగ్గ రీతిలో కూడా లేదు అందులో. ఐతే, ఇప్పటికే ఈ భామ రవితేజ సరసన “ఖిలాడీ” చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట.

మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లారు. ఆయన ఇండియాకి వచ్చాక త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అవుతుంది.

Advertisement
 

More

Related Stories