దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ఫ్లాట్ ను అమ్మకానికి పెట్టారు. ఇప్పుడా ఫ్లాట్ ను నటి అదా శర్మ దక్కించుకుంది.
సుశాంత్ ఫ్లాట్ ను అదా శర్మ కొనుగోలు చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ నటి వాటిని ధృవీకరించింది. నెల రోజులుగా తను సుశాంత్ ఫ్లాట్ లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. ఇంటికి కొన్ని మార్పుచేర్పులు కూడా చేసినట్టు వెల్లడించింది.
ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని దేవుడి గదిగా మార్చేసిందట అదా. పై ఫ్లోర్ లో ఓ గదిని మ్యూజిక్ రూమ్ గా, మరో గదిని డాన్స్ స్టుడియోగా మార్చింది. ఇక టెర్రస్ మొత్తాన్ని గార్డెన్ గా మార్చేసిందట. తను ఎక్కడున్నా పచ్చదనం ఉండాలని, పక్షులకు ఆహారం పెట్టడం తనకు ఇష్టమని, అందుకే గార్డెన్ పెట్టుకున్నానని తెలిపింది.
సుశాంత్ ఇంట్లో అడుగుపెట్టగానే తనకు ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగిందని, దాన్ని మరింత పెంచేందుకు ఇళ్లు మొత్తానికి తెలుగు రంగు పెయింట్ వేయించినట్టు వెల్లడించింది.
సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…
బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు…
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో…
ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న "టాక్సిక్" (Toxic) సినిమాకి…
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…