విజయ్ దేవరకొండ, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల కలుసుకున్నారు. వారిద్దరూ కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆ మాటకొస్తే విజయ్ దేవరకొండకు దర్శకుడు ప్రశాంత్ నీల్, కన్నడ సూపర్ స్టార్ యష్ తో “కేజీఎఫ్” విడుదలకు ముందు నుంచే మంచి స్నేహం ఉంది.
ఐతే, తాజాగా విజయ్ దేవరకొండని ప్రశాంత్ నీల్ కలవడం, ఆ ఫోటో బయటికి రావడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం దేశంలో ప్రశాంత్ నీల్ మన టాప్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత యమా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు. “కేజీఎఫ్” సినిమాలతో పాటు “సలార్”తో ఆయనకి క్రేజ్ అమాంతం పెరిగింది.
పైగా ఇప్పుడు “సలార్ 2” మొదలు కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ ఉంది. దాంతో, విజయ్ ని ఎందుకు కలిశాడు అనే ప్రశ్న వస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా ఫ్లాపుల్లో ఉన్నాడు. వచ్చిన స్టార్డంకి దెబ్బ పడింది.
విజయ్ దేవరకొండ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోవడం లేదు. కేవలం ఇది స్నేహపూర్వక మీటింగ్ అని సమాచారం.
"గ్యాప్ రాలేదు, తీసుకున్నాను". బన్నీ నటించిన సినిమా హిట్ లో డైలాగ్ ఇది. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ చేస్తోంది…
80లలో హైదరాబాద్ సినిమా సంస్కృతి, భారతీరాజా (Bharathiraja) శకం మొదలైనప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు శ్రీ అట్లూరి మాటల్లో… హైదరాబాద్లోని శాంతి…
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…