కంగన రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కానీ ఆమె నటించి, దర్శకత్వం వహించిన “ఎమెర్జెన్సీ” చిత్రానికి ఇంకా మోక్షం లభించడం లేదు. ఈ సినిమాలో ఆమె ఇందిరాగాంధీ పాత్ర పోషించారు.
సాధారణంగా ఇలాంటి సినిమాలను బీజేపీ ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకో అంతగా ఆసక్తి చూపడం లేదు. లేని సమస్యలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, సులువుగా విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇన్ని అడ్డంకులు.
కెనెడా ప్రభుత్వంతో భారత్ దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఇలాంటి టైంలో సిక్కులు – ఇందిరాగాంధీ అంశాలు ఈ సినిమాలో ఉండడంతో భారత్ వాదనకి ఇబ్బంది కలిగేలా ఉందట. అందుకే, ప్రభుత్వం నుంచి సహకారం అంతగా లేదు. ఐతే, కంగనా కూడా అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించింది. ఐతే, విడుదల చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఆమోదం రావాలి.
అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే కంగనా ఈ సినిమా డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ ప్రచార కార్యక్రమాలు మొదలుపెడుతుంది.
ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…