కంగన రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కానీ ఆమె నటించి, దర్శకత్వం వహించిన “ఎమెర్జెన్సీ” చిత్రానికి ఇంకా మోక్షం లభించడం లేదు. ఈ సినిమాలో ఆమె ఇందిరాగాంధీ పాత్ర పోషించారు.
సాధారణంగా ఇలాంటి సినిమాలను బీజేపీ ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకో అంతగా ఆసక్తి చూపడం లేదు. లేని సమస్యలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, సులువుగా విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇన్ని అడ్డంకులు.
కెనెడా ప్రభుత్వంతో భారత్ దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఇలాంటి టైంలో సిక్కులు – ఇందిరాగాంధీ అంశాలు ఈ సినిమాలో ఉండడంతో భారత్ వాదనకి ఇబ్బంది కలిగేలా ఉందట. అందుకే, ప్రభుత్వం నుంచి సహకారం అంతగా లేదు. ఐతే, కంగనా కూడా అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించింది. ఐతే, విడుదల చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఆమోదం రావాలి.
అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే కంగనా ఈ సినిమా డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ ప్రచార కార్యక్రమాలు మొదలుపెడుతుంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…