మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతకాలంగా మంచు కుటుంబం వీధుల్లోనే గొడవలు పెట్టుకుంటోంది. తాజాగా మంచు విష్ణు డైలాగ్ వార్ మొదలుపెట్టాడు.
తన తండ్రి నటించిన “రౌడీ” చిత్రంలోని డైలాగ్ ట్విట్టర్లో పోస్ట్ చేసి తన సోదరుడు మనోజ్ కి చురకలంటించాడు విష్ణు. ఇక విష్ణుకి జవాబు అన్నట్లుగా మనోజ్ కూడా మోహన్ బాబు మరో సినిమాలోని డైలాగ్ ట్విట్టర్లో పెట్టి మరింత అగ్గి రాజేశాడు.
“సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావని ఆశ,” అని మోహన్ బాబు పలికిన ‘రౌడీ’ చిత్రంలోని డైలాగ్ క్లిప్ ని విష్ణు పోస్ట్ చేశాడు.
“కాలు దువ్వాలనుకుంటే అడుగుపెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం వల్లో వేసేవాణ్ని. నా ఆలీ సెప్పింది కాబట్టి…గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్ఛా,” అని మోహన్ బాబు డైలాగ్ ని మనోజ్ షేర్ చేశాడు. అంతే కాదు ఈ డైలాగ్ “#VisMith” కి అని పెట్టాడు. హాలీవుడ్ సినిమా అని క్లూ ఇచ్చాడు. అంటే విష్ణు గురించి అని చెప్పకనే చెప్పాడు.
మొత్తానికి అన్నదమ్ములిద్దరూ సింహాలు, కుక్కలు, పెళ్ళాలు అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ఒకరిపై ఒకరు.
హీరోయిన్ నయనతార (Nayanthara) లాంగ్ గ్యాప్ తీసుకుంది. కేవలం ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు, తన వివాహ…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94వ ఏట తీసిన చిత్రం.. సింగ్ గీతం (Sing Geetham). ఈ సినిమా జూన్…
'పెద్ది' సినిమాను ఇప్పటికే ఎంతోమంది మెచ్చుకున్నారు. అయితే అందరూ ఒకెత్తు, బన్నీ ఒక్కడు ఒకెత్తు. ఓ సెక్షన్ మెగాభిమానులైతే, అల్లు…
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…