గ్లోబల్ స్థాయిలో పేరున్న ప్రియాంక చోప్రా గురువారం హైదరాబాద్ కి వచ్చింది అనే విషయం ఇప్పటికే మేం పోస్ట్ చేశాం. ఆమె హైదరాబాద్ కి రావడానికి కారణం కూడా దర్శకుడు SS రాజమౌళిని కలవడానికే అని చెప్పాం. అది నిజమని ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియచేసింది.
రాజమౌళి తదుపరి చిత్రంలో ఆమె నటించనుంది అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో ఆమె మహేష్ బాబు సరసన నటించనుంది. అందుకోసమే ఆమె హైదరాబాద్ రావాల్సి వచ్చింది.
శుక్రవారం ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది.టొరంటో నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు విమానంలో వస్తున్న వీడియో అది. ఆమె విమానంలోని తన సీట్లో కాళ్లు సీట్ పై పెట్టుకొని రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”లోని పాటని వింటున్నట్లుగా ఉంది ఆ వీడియోలో. ఆమె అలా తన హైదరాబాద్ ట్రిప్ గురించి ఇండైరెక్ట్ గా కంఫర్మ్ చేసింది. సో, ఆమె రాజమౌళి చిత్రంలో నటించింది అనేది పక్కాగా రూఢి అయింది.
త్వరలోనే టీం నుంచి ఇక అధికారిక ప్రకటన రావొచ్చు. ఆమె గతంలో “అపురూపం” అనే తెలుగు సినిమాలో నటించింది కానీ ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…