విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి వెండితెరపై కనిపించనున్నారు. ‘గీతగోవిందం’ చిత్రంతో విజయ్ దేవరకొండ, రష్మిక జంట బ్లాక్ బస్టర్ జోడీగా నిలిచింది. ఈ జంటకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది.
దీని తర్వాత వారు ‘డియర్ కామ్రేడ్’ కోసం మళ్లీ కలిశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ జంట క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రష్మిక మళ్లీ కలిసి నటించబోతున్నారు. వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ తో సినిమా చేయబోతున్నాడు. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’తో పాపులరైన రాహుల్, ఈసారి విజయ్ ను మరో కొత్త పాత్రలో చూపించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి కాంబినేషన్ కోసం కాకుండా, కథ బాగుంటేనే తామిద్దరం కలిసి నటిస్తామని గతంలోనే విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కాబట్టి రాహుల్ సినిమాలో రష్మికకు పవర్ ఫుల్ రోల్ దక్కినట్టే ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…