“పోకిరి” సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ఇలియానా. ఒక ఏడేళ్లు తెలుగులో ఆమె హవా నడిచింది. ఆ తర్వాత ఆమెని తెలుగు ఫిలింమేకర్స్ పట్టించుకోవడం మానేశారు. ఐతే, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తెలుగు కెరీర్ ఏడేళ్ల తర్వాత మందగించడానికి కారణం ఇది అంటూ ఒక వివరణ ఇచ్చింది.
ఇలియానా చెప్పిన కారణం చూస్తే ఆమె బాలీవుడ్ మీడియా ముందు అసలు విషయం దాచేస్తోంది అని చెప్పొచ్చు.
“నేను బర్ఫీ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ వెళ్ళాను. ఆ సినిమా హిట్ కావడంతో నాకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగు దర్శక, నిర్మాతలు నన్ను పట్టించుకోలేదు. నేను తెలుగులో ఇక నటించను అని భావించారు వాళ్ళు,” అని తనకు తెలుగులో ఎందుకో క్రేజ్ పోయిందో చెప్పింది.
కానీ నిజం ఏంటంటే ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టే టైంకే ఆమెకి ఇక్కడ వరుసగా ఫ్లాపులు వచ్చాయి. “శక్తి”, “నేను నా రాక్షసి”, “దేవుడు చేసిన మనుషులు” వంటి దారుణమైన ఫ్లాపులు చూసింది ఆమె. ఆ టైంలో ఆడిన ఒకే ఒక్క మూవీ… జులాయి.
మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఆమెకి తెలుగు దర్శక నిర్మాతలే పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలా ఆమె నటించిన “అమర్ అక్బర్ ఆంటోని” దారుణంగా ఫ్లాప్ అయింది. అంతే అంతటితో ఆమె కేరీర్ కి ఎండ్ కార్డు పడింది తెలుగులో. ఇది అసలు విషయం. ఇలా చెప్పకుండా బాలీవుడ్ కి వెళ్లడం వల్ల తనని తెలుగు నిర్మాతలు పట్టించుకోలేదు అని చెప్తోంది.
ఇటీవలే ఈ భామ ఒక బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిగా బిజీగా ఉంది. అమెరికాలో నివసిస్తోంది.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…