రాజ్ తరుణ్ బయటకు రావొచ్చు. చక్కగా తన పనులు తాను చేసుకోవచ్చు. ధైర్యంగా మీడియాను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే, అతడిపై ఉన్న అతిపెద్ద మచ్చ చెరిగిపోయింది. ఎవరైతే రాజ్ తరుణ్ పై ఇన్నాళ్లూ విమర్శలు చేశారో, కేసులు పెట్టారో.. స్వయంగా ఆ అమ్మాయే రాజ్ తరుణ్ కు క్షమాపణలు చెప్పింది.
రాజ్ తరుణ్ తన భర్త అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన లావణ్య, ఆ వివాదాన్ని దాదాపు 2 నెలల పాటు కొనసాగించింది. తాజాగా ఉన్నట్టుండి రూటు మార్చింది. రాజ్ తరుణ్ మంచోడంటూ మీడియా ముందు ప్రకటించింది. అతడికి క్షమాపణలు కూడా చెప్పింది. రేపోమాపో రాజ్ తరుణ్ పై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానంటోంది లావణ్య.
అయితే ఇక్కడే లీగల్ గా చాలా చిక్కులున్నాయి. కేసు పెట్టడం వరకే మన వంతు. ఉన్నఫలంగా వాపస్ తీసుకుంటామంటే అన్ని కేసుల్లో అది సాధ్యం కాదంటున్నారు లీగల్ విషయాలు తెలిసిన నిపుణులు.
కొన్ని కేసులు పెట్టినంత ఈజీగా ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని, రాజ్ తరుణ్ పై లావణ్య పెట్టిన కేసు కూడా అలాంటిదేనని అంటున్నారు. ఉన్నఫలంగా కేసు వెనక్కు తీసుకోవాలని లావణ్య భావించినప్పటికీ, విషయం కోర్టు వరకు వెళ్లింది కాబట్టి, అది అంతిమంగా పోలీసులకు ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నారు. సో.. ప్రస్తుతానికైతే రాజ్ తరుణ్ కు స్వల్ప ఊరట మాత్రమే దక్కిందనుకోవాలి.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…