బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో పనిచేస్తున్నారు మన తెలుగు సినిమాటోగ్రాఫర్ మధుసూదన్ కోట. ప్రస్తుతం “అన్నోన్ టు నోన్” అనే డాక్యుమెంటరీ చిత్రీకరణ జరుగుతోంది. సంజీవ్ కుమార్ రాజ్పుత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ డాక్యుమెంటరీని M.S స్టూడియోస్ నిర్మిస్తోంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల జీవితాలపై దృష్టి పడేలా చేసే స్ఫూర్తిదాయకమైన చిత్రంగా రూపొందిస్తున్నారు.
నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB)కి ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా జాన్ అబ్రహం ఉన్నారు. కేవలం ఆ హోదాలోనే కాకుండా ఈ అంశంలో జాన్ అబ్రహం వ్యక్తిగత నిబద్ధత కూడా చూపిస్తున్నారు. అన్నోన్ టు నోన్ అనేది కేవలం ఒక డాక్యుమెంటరీ కంటే ఎక్కువ. ఇది ఈ అంశంలో అవగాహన పెంచడం, అర్థవంతమైన మార్పును నడిపించడం లక్ష్యంగా పెట్టుకున్న శక్తివంతమైన సామాజిక అస్త్రం.
అడ్డంకులను అధిగమించి విజయవంతమైన జీవితాలను నిర్మించిన దృష్టి లోపం ఉన్న వ్యక్తుల నిజ జీవిత కథలను అన్వేషిస్తుంది ఈ చిత్రం. వారి కథనాల ద్వారా, ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ప్రేరేపించాలని ఆశిస్తుంది.
కెమెరా వెనుక తన అనుభవాన్ని పంచుకుంటూ మధుసూదన్ కోట ఇలా అన్నారు:
“ఈ ప్రాజెక్ట్ కోసం జాన్ అబ్రహంను నా కెమెరా ద్వారా బంధించిడం ఒక అద్భుతమైన అనుభూతి. అతని సహజ భావోద్వేగ మనస్తతం ప్రతి ఫ్రేమ్కు ఒక ప్రత్యేకమైన ప్రామాణికతను తెస్తోంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల బలం, వారి స్ఫూర్తిని దృశ్యమానంగా తెలియజేయడం సవాలు. జాన్ దీనికి తోడుగా ఉండడం వల్ల మరింత బలం వచ్చింది.”
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…