ఒక దశలో నెంబర్ వన్ గా వెలిగింది హీరోయిన్ పూజ హెగ్డే. ఆ సమయంలో తన విజయాన్ని చూసి కొన్ని శక్తులు కుల్లుకున్నాయి. ఆ కుళ్ళు, అసూయ, ద్వేషంగా మారి తనపై ట్రోలింగ్ చేయించారని తాజాగా తెలిపింది పూజ హెగ్డే.
“తమ పీఆర్ టీంకి చెప్పి ట్రోలింగ్ బ్యాచ్ కి డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియాలో నాపై బురద జల్లేవారు. మీమ్స్, పోస్టులతో నెగెటివ్ గా మెసేజిలు పెట్టించేవారు. నాపై ట్రోలింగ్ చేసేందుకు వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టారని తెలిసినప్పుడు షాక్ అయ్యాను,” అని తెలిపింది పూజ.
ప్రస్తుతం తన కెరీర్ ప్రశాంతంగా సాగుతోందని చెప్తోంది. పూజ హెగ్డే దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉంది. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఐతే, తమిళ, హిందీ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.
తమిళంలో ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే మరో చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక హిందీలో తాజాగా వరుణ్ ధావన్ సరసన సినిమా స్టార్ట్ చేసింది. ట్రోలింగ్, అపజయాల వల్ల ఏడాదిన్నర పాటు వర్క్ లేకుండా ఇంట్లో కూర్చున్న ఈ భామ మళ్ళీ ఇప్పుడు బిజీ బిజీగా మారింది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…