తను ఏం చేసినా కొత్తగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఓ ఈ-సైకిల్ బ్రాండ్ ప్రచారం కోసం ధోనీతో కలిసి యాడ్ షూట్ చేశాడు. ఇందులో ధోనీని ‘యానిమల్’ లో రణబీర్ కపూర్ లా చూపించి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.
ఏమాటకామాట చెప్పుకోవాలి. ధోనీ యాక్టింగ్ ఇరగదీశాడు. సినీ నటుడికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో అతడి యాటిట్యూడ్ ఉంది. ఇక యాడ్ చివర్లో ‘యానిమల్’లో రణబీర్ కపూర్ చేసిన మేనరిజమ్ ను ధోనీతో చేయించి, తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు వంగా.
ప్రస్తుతం ఈ దర్శకుడు ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక దఫా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. తాజాగా నటీనటుల ఎంపిక కూడా పూర్తిచేశాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.
లెక్కప్రకారం ఈ పాటికే సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ప్రభాస్ ఆమధ్య గాయపడడం, ఆ తర్వాత ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీ అవ్వడం వల్ల ‘స్పిరిట్’ షూట్ లేట్ అవుతోంది.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…