తను ఏం చేసినా కొత్తగా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఓ ఈ-సైకిల్ బ్రాండ్ ప్రచారం కోసం ధోనీతో కలిసి యాడ్ షూట్ చేశాడు. ఇందులో ధోనీని ‘యానిమల్’ లో రణబీర్ కపూర్ లా చూపించి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.
ఏమాటకామాట చెప్పుకోవాలి. ధోనీ యాక్టింగ్ ఇరగదీశాడు. సినీ నటుడికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో అతడి యాటిట్యూడ్ ఉంది. ఇక యాడ్ చివర్లో ‘యానిమల్’లో రణబీర్ కపూర్ చేసిన మేనరిజమ్ ను ధోనీతో చేయించి, తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు వంగా.
ప్రస్తుతం ఈ దర్శకుడు ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక దఫా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశాడు. తాజాగా నటీనటుల ఎంపిక కూడా పూర్తిచేశాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.
లెక్కప్రకారం ఈ పాటికే సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ప్రభాస్ ఆమధ్య గాయపడడం, ఆ తర్వాత ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీ అవ్వడం వల్ల ‘స్పిరిట్’ షూట్ లేట్ అవుతోంది.
సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…
బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు…
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో…
ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న "టాక్సిక్" (Toxic) సినిమాకి…
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…