సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. “డీజే టిల్లు”, “టిల్లు స్క్వేర్” సినిమాలతో హీరోగా తన మార్కెట్ ని భారీగా పెంచుకున్నాడు. ఐతే, “టిల్లు స్క్వేర్” విడుదలై ఏడాది కావొస్తోంది. ఈ గ్యాప్ లో మరో సినిమా విడుదల చెయ్యలేకపోయాడు. పెద్ద హీరోల తరహాలో ఏడాదికి ఒక్క సినిమా చేస్తున్నాడు.
ఐతే, ఇకపై అలా ఉండదు అని చెప్తున్నాడు. తాను స్లోగా సినిమాలు చేసి ఇక నష్టపోదల్చుకోలేదు అంటున్నాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేస్తే ఇప్పుడున్న మార్కెట్ రీత్యా బాగా సంపాదించుకోవచ్చు. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే చాలా ఆదాయం కోల్పోయినట్లే.
మిగతా హీరోల్లా సిద్ధూకి పెద్ద బ్రాండ్స్ లేవు. వాటివల్ల ఆదాయం రాదు. కేవలం సినిమాల పారితోషకం మీదే ఆధారపడాలి. అందుకే ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు.
వచ్చేనెల 10న “జాక్” అనే సినిమా రిలీజ్ కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో “తెలుసుకదా” అనే సినిమా రానుంది. ఈ రెండు విడుదల కాకముందే, “కోహినూర్” అనే మరో సినిమా మొదలుపెట్టాడు. దాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు స్పీడ్ పెంచాడు సిద్దూ జొన్నలగడ్డ.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…