ప్రభాస్ కొత్త సినిమా ప్రకటనకు సంబంధించి తెరవెనక జోరుగా కార్యక్రమాలు సాగుతున్నాయి. శివరాత్రి నాడే ప్రకటన వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఈ గ్యాప్ లో టెస్ట్ కట్స్ పూర్తి చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. ఆల్రెడీ ప్రభాస్ పై టెస్ట్ షూట్ కూడా పూర్తయింది.
ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం భాగ్యశ్రీ బోర్సేను ప్రభాస్ సరసన హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమెపై కూడా తాజాగా టెస్ట్ షూట్ నిర్వహించారు. ఇలా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ లో సినిమా పనులు జోరుగా సాగుతున్నాయి.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ భాగ్యశ్రీకి అవకాశాలొస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ లాంటి హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటున్నారు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…