బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ మరోసారి కలవబోతున్నారు. ఇప్పటికే 3 సినిమాలు చేసిన ఈ కాంబినేషన్ లో ఇప్పుడు నాలుగో సినిమా రాబోతోంది. అది కూడా ప్రతిష్టాత్మక సీక్వెల్ కావడం విశేషం.
‘ఆదిత్య 369’ కు సీక్వెల్ చేయాలనే కోరిక బాలయ్యకు ఎప్పట్నుంచో ఉంది. సీక్వెల్ కోసం కథ తనే రాశానని, రాత్రికి రాత్రి సింగిల్ సిట్టింగ్ లో కథ రెడీ అయిపోయిందని ఆయన గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు. ఒక దశలో సినిమాను తనే డైరక్ట్ చేస్తానని కూడా తనకుతానుగా ప్రకటించుకున్నారు.
కానీ దర్శకత్వ బాధ్యతల నుంచి బాలయ్య తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెల్ ను క్రిష్ చేతిలో పెట్టినట్టు సమాచారం.
బాహుబలి లాంటి సినిమాను తీసిన ఆర్కా మీడియా ‘ఆదిత్య 999’ సినిమాను తెరపైకి తీసుకొస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి టైమ్ పట్టేలా ఉంది.
గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు బాలయ్య. ఆ సినిమా పూర్తయితే తప్ప ఈ సీక్వెల్ రాదు. మరోవైపు క్రిష్ కూడా ‘ఘాటీ’ పనుల్లో ఉన్నారు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలొచ్చాయి.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…