జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కి ఓటమి భయం పట్టుకొంది అని అంటున్నారు యాంకర్ శ్యామల. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికే హోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ తరఫున ఆయన కుటుంబ హీరోలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
పిఠాపురంలో ఎక్కడా చూసిన జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. జనం నుంచి కూడా స్పందన బాగుందనేది టాక్. ఈసారి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని జనసేన వర్గాలు చెపుతున్నాయి.
ఐతే, శ్యామల మాత్రం పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు అని అంటున్నారు. వైసీపీ నాయకురాలు వంగా గీత పవన్ కళ్యాణ్ పై గెలుస్తారు అనేది ఆమె అభిప్రాయం.
“పవన్ కళ్యాణ్ కి ఓడిపోతాననే భయం పట్టుకోవడం వల్లే రోజుకో తమ కుటుంబ హీరోని పిఠాపురం రప్పించి ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ ప్రకారం ఎవరూ ప్రచారం చేయకున్నా గెలవాలి కదా. ఈ హీరోల ప్రచారం బట్టే అర్థం అవుతోంది ఆయన భయం ఎలా ఉందో” అనే వాదన వినిపిస్తున్నారు శ్యామల.
శ్యామల చాలాకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతుదారుగా ఉన్నారు. ఈ సారి కూడా ఆమె వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆమె పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గీత తరఫున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఈ కామెంట్స్ చేశారు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…