హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. ఉన్న కెరీర్ లోనే క్రేజ్ తో పాటు కాసులు వెనకేసుకోవాలి. అయితే ఇప్పుడు హీరోయిన్లకు రీఎంట్రీ అనే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లంతా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ సాయేషా కూడా అదే బాటలో నడుస్తోంది.
తన రీఎంట్రీ కోసం ఈమె చాలా పెద్ద ప్లాన్ వేసింది. ముందుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టింది. తనలో ఇంకా గ్లామర్ తగ్గలేదని, డాన్స్ లో గ్రేస్ అలానే ఉందని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత రీఎంట్రీని ఘనంగా ప్రకటించాలని అనుకుంటోంది.
భర్త ఆర్య సినిమాతో సాయేషా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఒకప్పటి హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ లోకి మారుతుంటే, సాయేషా మాత్రం మరోసారి హీరోయిన్ గానే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
తెలుగులో “అఖిల్” సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత తమిళ్ లో 2-3 సినిమాలతో పేరు తెచ్చుకుంది. కార్తి లాంటి హీరోలు ఈమెకు సక్సెస్ అందించారు. అదే టైమ్ లో ఆర్యతో ప్రేమలో పడి, అతడ్నే పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చి, ఇప్పుడు రీఎంట్రీ ఆలోచనలో ఉంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…