సినిమా థియేటర్ టికెట్ రేట్లు కన్నా మల్టిప్లెక్స్ లలో పాప్ కార్న్, వాటర్ బాటిల్, కాఫీ రేట్లు ఎక్కువ భయపెడుతున్నాయి జనాలని. పీవీఆర్ వంటి మల్టిప్లెక్స్ లలో కాఫీ రేట్ 300 రూపాయలు. పాప్ కార్న్ 350, 400 రూపాయలు. నీళ్లు తాగాలన్న 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే.
అందుకే, ఫ్యామిలీ ఆడియెన్స్ థియటర్లకు వెళ్లడం తగ్గింది. నలుగురు ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్తే 1000 రూపాయలు టికెట్లకు ఐతే పాప్ కార్న్, వాటర్ కి మరో వెయ్యి సమర్పించాలి. అందుకే ఇప్పుడు వీటిని తగ్గించాలనే డిమాండ్ మొదలైంది.
మొదటిసారిగా ఒక హీరో ఈ విషయంలో గట్టిగా తన గొంతు విప్పారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్… థియేటర్లలో ఈ ధరలు తగ్గకపోతే సినిమా పరిశ్రమ మనుగడకే సమస్య అని గుర్తించిన నిఖిల్ ఇండస్ట్రీ అంతా స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు.
అంతే కాదు, మన వాటర్ బాటిల్ ని మనమే థియేటర్లోకి తీసుకెళ్దాం. వాటర్ బాటిల్ ని తీసుకెళ్లడాన్ని మల్టిప్లెక్స్ లు ఆపొద్దని నిఖిల్ అంటున్నారు. అతని వాదన సబబుగానే ఉంది కదా.
నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం “ఇండియా హౌస్”, “స్వయంభు” వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. రెండూ పాన్ ఇండియన్ చిత్రాలే.
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…