న్యూస్

‘ఓం శాంతి’ మహిళలకు అంకితం

తరుణ్ భాస్కర్ దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా, నటుడిగా బిజీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం… “ఓం శాంతి శాంతి శాంతిః”. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యంగా సాగుతుంది.

ఈ సినిమా నుంచి రెండో పాట తాజాగా బయటికి వచ్చింది. “ఓం శాంతి శాంతి శాంతిః” థీమ్ సాంగ్ ఇది. ఈ పాటని మహిళలకు అంకితం చేసింది టీం.

A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు.

జయ్ కృష్ణ హార్ట్ టచ్చింగ్ గా కంపోజ్ చేశారు. అభయ్ జోధ్‌పుర్కర్ గాత్రం మరింత అందాన్ని ఇచ్చింది. భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

TeluguCinema

Recent Posts

The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…

5 hours ago

Samantha: అవును, మెటర్నిటీ బ్రేక్ తీసుకోబోతున్నా

గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…

5 hours ago

‘Alpha’ నాకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్: అలియా భట్

అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…

9 hours ago

Janhvi Kapoor: పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా?

"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…

14 hours ago

చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia

ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.…

15 hours ago

Anantha Sriram: లిరిసిస్ట్ కి వసూళ్ల దురద ఎందుకు?

రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…

1 day ago