ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమాలు తీయడం లేదు. కొందరు యువ దర్శకులకు తన ఐడియాలు చెప్పి సినిమాలు తీయిస్తున్నారు. అలా చేసిన కొత్త చిత్రం… ‘శారీ’ (Saaree).
ఇన్ స్టాగ్రామ్ లో తన శారీ ఫోటోషూట్ లతో మొదట గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి ఆరాధ్య దేవి అందానికి ఫిదా అయిన ఆర్జీవీ శారీ కథ అల్లేశారు. ఈ సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఐతే, ఇది చీర కథ కాదు ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది అని అంటున్నారు ఆర్జీవీ. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు గిరి కృష్ణ కమల్ దీన్ని రూపొందించారు.
“సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ మీద చేసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. నేను చేసిన స్క్రిప్ట్ కంటే చాలా గొప్పగా దర్శకుడు గిరికృష్ణ కమల్ మూవీని రూపొందించాడు,” అన్నారు ఆర్జీవీ
హీరోయిన్ ఆరాధ్య దేవి తనకు అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్ చెప్పింది. :ఈ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్,” అని తెలిపింది ఆరాధ్య.
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…