Advertisement
తెలుగు న్యూస్

బ్రెయిన్ ఉందా… సమంత ఫైర్!


సమంత ఈ రోజు తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తరుచుగా తిరుమల వెళ్తుంటారు. ఐతే, దేవుడిని దర్శించుకొని బయటికి రాగానే, మీడియా వాళ్ళు ఆమెని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక జర్నలిస్ట్ ఆమెని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. దాంతో, సమంతకి చిర్రెత్తుకొచ్చింది. “బుద్దుందా… నేను వచ్చింది దైవదర్శనానికి అని తెలుసా?” అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

సమంత స్పందనకి సదరు జర్నలిస్ట్ కంగారుపడ్డారట.

గత కొంతకాలంగా సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ ఇప్పటివరకు ఆ పుకార్లపై స్పందించలేదు. మౌనం వహిస్తూ వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమంతని ఆ ప్రశ్న అడగడం మీడియా వారిదే తప్పు.

సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఒక పద్దతి ప్రకారం ఈ పుకార్ల గురించి సైలెంట్ గా ఉన్నారు. త్వరలోనే వారు ఈ పుకార్లకు ఒక ముగింపు పలికి, అన్ని విషయాల్లో క్లారిటీ ఇస్తారని ఆశిద్దాం. మరోవైపు, సమంత మళ్ళీ సినిమాలు సైన్ చేస్తోంది.

Advertisement

This post was last modified on September 18, 2021 2:13 pm

Advertisement
Share