Advertisement
తెలుగు న్యూస్

65 దాటినా షూటింగ్లో పాల్గొనొచ్చు


సీనియర్ నటులకు గుడ్ న్యూస్!

65 దాటిన నటులు, సాంకేతిక నిపుణులు సినిమా షూటింగ్లో పాల్గొనకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన అర్ధరహితమని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. కోవిద్ 19 నేపథ్యంలో మహారాష్ట్ర ఈ నిబంధన తెచ్చింది… అదే రూల్ ని మన తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఇంప్లీమెంట్ చేస్తున్నాయి. షూటింగులకు అనుమతి ఇస్తూనే ఈ నిబంధన పెట్టడం… మా పొట్ట కొట్టడమే అని కొందరు సీనియర్ నటులు అక్కడి కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది.

అంటే… అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి సీనియర్ నటులకి ఇక ఈ ఇబ్బంది ఉండదు… షూటింగ్లో పాల్గొనచ్చు. ఐతే… కరోనా సేఫ్టీ నియమాలు మాత్రం పాటించాల్సిందే.

77 ఏళ్ల అమితాబ్ ఇటీవలే కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పట్లో ఆయన షూటింగ్ లో పాల్గొనే రిస్క్ తీసుకోరు. ఇక ఈ నెల 22న 65వ బర్త్ డే జరుపుకునే మెగాస్టార్ చిరంజీవి… “ఆచార్య” షూటింగ్ ని నిలిపివేశారు. హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గాకే… మెగాస్టార్ మళ్ళీ షూటింగ్ షురూ చేస్తారు. 69 ఏళ్ల రజినీకాంత్ “అన్నత్థే” అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ కూడా ఆగింది. ఆయన కూడా ఇప్పట్లో షూటింగ్ లొకేషన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడరు. కమల్ హాసన్ కి 65 ఏళ్ళు. కమల్ నటిస్తోన్న “భారతీయుడు 2” షూటింగ్ చాలా నెలలుగా ఆగింది.

Advertisement

This post was last modified on August 7, 2020 9:42 am

Advertisement
Share