Advertisement
తెలుగు న్యూస్

‘అల్లు’డి కోసం మామ పార్టీ


అల్లు అర్జున్ ఇప్పుడు హీరోగా టాప్ గేర్ లో దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ స్థాయి దాటి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అల్లుడి విజయాన్ని, పాపులారిటీని చూసి ఆయన మామయ్య ఉప్పొంగిపోతున్నారు. తండ్రికి పుత్రోత్సహంలా, మామకి జామాతోత్సవం అన్నమాట.

అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ‘పుష్ప’ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం పార్క్ హయత్ హోటల్లో ఈ పార్టీ ఘనంగా జరిగింది. అలాగే అల్లుడిని ఆయన సన్మానించారు. అక్కడే అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ బన్నీ గజమాలతో సత్కరించారు.

ఈ పార్టీకి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, బన్నీ తండ్రి అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, భానుప్రకాష్ ఐఏఎస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ విచ్చేశారు.

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అయన కూతురు స్నేహ (అల్లు అర్జున్ భార్య) ఈ పార్టీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

Advertisement

This post was last modified on March 20, 2022 9:42 pm

Advertisement
Share