Advertisement
తెలుగు న్యూస్

శ్రీదేవి రెండో కూతురు ఎంట్రీ కన్ఫర్మ్

శ్రీదేవి మొదటి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకొంది. బాలీవుడ్ హీరోయిన్ గా స్థిరపడింది. శ్రీదేవి చిన్న కూతురు కూడా నటిగా మారుతోంది.

“అవును…ఖుషి మొదటి చిత్రం సైన్ చేసింది. ఈ ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది,” అని బోని కపూర్ తెలిపారు. జాన్వీ కపూర్ కూడా త్వరలోనే తెలుగులో నటిస్తుందని ఇటీవలే బోని కపూర్ చెప్పారు. ఐతే, శ్రేదేవి కూతుళ్లిద్దరికీ బాలీవుడ్ పైనే ప్రధాన దృష్టి.

ఖుషి కపూర్ మొదటి చిత్రం నెట్ ఫ్లిక్స్ మూవీ. ప్రముఖ దర్శకురాలు జోయా అఖ్తర్ నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకొని కొన్ని సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా పరిచయం కానున్నాడు. షారుక్ ఖాన్ కూతురు సుహానా మరో హీరోయిన్ గా నటించనుంది.

ఇలా ఒకే సినిమాలో ముగ్గురు వారసులు పరిచయం కానున్నారు.

ఖుషి కపూర్ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేసింది. ఆమెకిప్పుడు 21 ఏళ్ళు. అక్క జాన్వీతో పోల్చితే ఖుషి ముఖంలో శ్రీదేవి పోలికలు ఎక్కువ.

Advertisement

This post was last modified on February 26, 2022 10:50 am

Advertisement
Share