Advertisement
తెలుగు న్యూస్

‘వాలి’ రీమేక్ చెయనున్న బోనీ


దాదాపు 22 ఏళ్ల తర్వాత ఒక సినిమా రీమేక్ కానుంది. అజిత్ హీరోగా రూపొందిన ‘వాలి’ చిత్రం తమిళంలో సంచలనం సృష్టించింది. 1999లో విడుదలైన ఆ మూవీ తెలుగులో కూడా డబ్ అయి విజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత బోని కపూర్ కి దాన్ని హిందీలో రీమేక్ చెయ్యాలనే మనసు పెట్టింది.

ఈ సినిమాకి దర్శకుడు యస్ జె సూర్య. ఆయన ఈ సినిమా రీమేక్ విషయంలో కోర్టులో కేసు వేశారు. దాంతో, రీమేక్ కుదరలేదు. ఇప్పుడు బోనికపూర్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఈ సినిమా రీమేక్ కి శ్రీకారం చుట్టనున్నారు . కపూర్స్ వెంచర్స్, నరసింహ ఎంటర్ ప్రైజస్ కలిసి నిర్మించనున్నాయి.

తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేస్తారట. మరి హీరోగా ఎవరు నటిస్తారు అనేది ఇంకా తేలలేదు. బోనీకపూర్ ఇటీవల దిల్ రాజ్ తో కలిసి ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు.

Advertisement

This post was last modified on November 27, 2021 6:47 pm

Advertisement
Share