Advertisement
తెలుగు న్యూస్

ఈ క్రిస్మస్ టాలీవుడ్ కి కీలకం

ఈ నెలలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని థియేటర్లు, మల్టిప్లెక్స్ స్క్రీన్ లు తెరుచుకోనున్నాయి. ఏఎంబీ మాల్ డిసెంబర్ 4న స్టార్ట్ అవుతోంది. సింగల్ థియేటర్లు కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి. ఐతే, జనం థియేటర్ కి రావాలంటే ఒక పేరున్న హీరో నటించిన కొత్త సినిమా ఒకటి రిలీజ్ కావాలి. అప్పుడే థియేటర్లు తెరుచుకున్నందుకు ఒక ఊపు ఉంటుంది. పాత సినిమాలు ప్రదర్శిస్తే జనం అసలు ఆసక్తి చూపరు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు తమ చూపుని సాయి తేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాపై నిలిపింది. ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా చూసేందుకు జనం వస్తే.. మిగతా సినిమాలన్నీ సంక్రాంతికి డేట్స్ లాక్ చేసుకుంటాయి.

అందుకే సాయి తేజ్ సినిమా టాలీవుడ్ బిజినెస్ కి కీలకంగా మారింది. రాబోవు సినిమాలవ్యాపారం ఎలా ఉంటుంది అనేది ఈ క్రిస్మస్ తేల్చుతుంది.

Advertisement

This post was last modified on December 1, 2020 3:11 pm

Advertisement
Share