Advertisement
తెలుగు న్యూస్

RX100 డైరెక్టర్ కి కరోనా

రెండేళ్ల క్రితం “RX100” సినిమా తీసి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతికి కరోనా సోకింది. “వచ్చేసింది. త్వరలో వస్తా… ప్లాస్మా ఇస్తా” అని చాలా సింపుల్ గా, పాజిటివ్ గా తనకి కరోనా పాజిటివ్ సోకిన విషయాన్ని ట్వీట్ చేశాడు. టాలీవుడ్ లో కరోనా సోకిన వారి లిస్టులో ఇతను కూడా చేరాడు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, రాజమౌళి, బండ్ల గణేష్, డీవీవీ దానయ్య, ఓ యువ నిర్మాత … ఇలా పలువురు కరోనా బారిన పడి కోలుకున్నారు, కుంటున్నారు.

“RX100” సంచలన విజయం సాధించినా… రెండో సినిమాని సెట్స్ పైకి ఇంకా తీసుకురాలేకపోయాడు అజయ్ భూపతి. దానికి కారణం… “మహా సముద్రం” అనే తన డ్రీం ప్రాజెక్టుకి ఇద్దరు హీరోల డేట్స్ కావలి. రవితేజ, సిద్ధార్థ్, నాగ చైతన్య… ఇలా పలువురు హీరోలు మొదట చేస్తామని చెప్పి ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో… ఇంకా సెట్ చేసుకోలేకపోయాడు.

ఐతే ఈ కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే “మహా సముద్రం” పట్టాలెక్కేలా ప్లాన్ చేశాడట.

Advertisement

This post was last modified on August 13, 2020 9:39 am

Advertisement
Share