Advertisement

హీరోలంతా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. నాగచైతన్య, నాగార్జున, సాయితేజ్.. ఇలా అంతా తమ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. ఈ విషయంలో మొన్నటివరకు తహతహలాడిన “ఫైటర్” యూనిట్ మాత్రం ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు.

ముంబైలోనే తీయాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇక రామోజీ ఫిలింసిటీలోనే కానిచ్చేస్తారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ముంబయిలోనే మళ్లీ స్టార్ట్ అవుతుందని చార్మి గతంలో చెప్పినప్పటికీ ప్రస్తుతం ముంబయిలో అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ని. సుశాంత్ మరణం తర్వాత అతడు అతన్ని ఒక వర్గం బాగా టార్గెట్ చేసింది. దాంతో కరణ్ సైలెంట్ అయ్యాడు.

ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న అనన్యపాండే ఓ నెపోకిడ్. ప్రస్తుతం బాలీవుడ్ లో నెపోకిడ్స్ పై ఉన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు. ఇలాంటి టైమ్ లో అనన్య పాండేతో ముంబైలో షూటింగ్ మొదలు పెడితే సమస్యలు వస్తాయేమోనని యూనిట్ భావిస్తోంది. ఈ కారణాల వల్ల ఫైటర్ సినిమా ఇంకా సెట్స్ పైకి రావట్లేదు.

త్వరలోనే దీనిపై పూరి-కరణ్ కలిసి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారట. స్పీడ్ గా ఫినిష్ చేద్దామనుకున్న పూరికి అటు కరోనా, ఇటు సుశాంత్ మరణం తర్వాత జరిగిన రగడతో చాలా గ్యాప్ పెరుగుతోంది. హీరో విజయ్ దేవరకొండ కూడా గప్ చుప్ గా ఉన్నాడు.

Advertisement

This post was last modified on September 16, 2020 4:02 pm

Advertisement
Share