Advertisement
తెలుగు న్యూస్

తొలి బ్యాచ్ సినిమాలు ఇవే


కరోనా మొదటి వేవ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకు సో బెటర్’ థియేటర్లలోకి మొదటగా వచ్చింది. మిగతా సినిమాలకు దారి చూపింది. ఈ రెండో వేవ్ అనంతరం వస్తున్న ఫస్ట్ బ్యాచ్ సినిమాలు.. జులై 30న విడుదల కానున్నాయి

తెలంగాణాలో పూర్తిస్థాయిలో థియేటర్లు రన్ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిమిత సంఖ్యలోనే థియేటర్లు నడవనున్నాయి. ఐతే, ‘ఇష్క్’, ‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ వంటి చిత్రాలు జులై 30, ఆగస్టు 6న థియేటర్లలోకి వస్తున్నాయి. అలాగే, ఆగస్టులోనే విడుదలకు సందీప్ కిషన్ నటించిన ‘గల్లీ రౌడీ’ కూడా రానుంది.

ఈ సినిమాలకు టికెట్ రేట్లతో సమస్య లేదు. థియేటర్లో చూసేందుకు జనం వస్తే చాలు. కొంత రిస్క్ కానీ… మేకర్స్ అందరూ నమ్మకంగా ఉన్నారు. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాలకు సపోర్ట్ ఇస్తోంది. సినిమాలకు మళ్ళీ జనం వస్తేనే ఇండస్ట్రీ నిలబడుతుంది. ఈ చిన్న సినిమాలు జనాలని ప్రిపేర్ చేసేందుకు పనికొస్తాయి.

అంతే కాకుండా, యూత్ కూడా థియేటర్లో సినిమా చూసేందుకు చాలా కాలంగా ఆసక్తితో ఉన్నారు. అది కలిసొచ్చే అంశం.

Advertisement

This post was last modified on July 26, 2021 5:32 pm

Advertisement
Share