Advertisement
తెలుగు న్యూస్

ఫ్లాప్ కొట్టు సారీ చెప్పు!


అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్… వీళ్ళు అందరూ ప్రేక్షకులకు, అభిమానులకు సారీ చెప్పినవారే. అంచనాలకు సినిమాలు అందుకోనప్పుడు, ఘోర పరాజయం ఎదుర్కొన్నప్పుడు అభిమానులకు ప్రత్యేక సందేశాలు, లెటర్స్ రాయడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయింది.

‘ఏజెంట్’ సినిమా దారుణాతి దారుణంగా పరాజయం పొందడంతో తాజాగా అఖిల్ తన అభిమానులకు లెటర్ రాశాడు. నిరాశపర్చినందుకు చింతిస్తూ మరో హిట్ తో పలకరిస్తాను అని హామీ ఇచ్చాడు ఫ్యాన్స్ కి.

అలాగే, హీరో వరుణ్ తేజ్ కూడా ఆ మధ్య ‘గని’ చిత్రం ఫ్లాప్ అయినప్పుడు అదే చేశాడు. అంతకుముందు విజయ్ దేవరకొండ కూడా ఒక సినిమా విషయంలో అదే విధంగా మెస్సెజ్ పెట్టాడు అభిమానులకు. ఇక రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ విషయంలో ఇదే చేసినట్లు అభిమానులు చెప్తున్నారు.
మొత్తమ్మీద ‘ఐ యామ్ వెరీ సారి అన్నాగా … ఈసారికి వదిలెయ్యొచ్చుగా” అంటూ పాడుతున్నారు హీరోలు.

ఇది హీరోలకు తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది అన్న మాట నిజమే. కానీ కథల విషయంలో హీరోల తీరు మారకపోతే ఈ సందేశాలు ఇంకోసారి రాయలేరు. రాసిన అభిమానులు క్షమించరు.

Advertisement

This post was last modified on May 16, 2023 10:26 am

Advertisement
Share