Advertisement
తెలుగు న్యూస్

జాక్వెలిన్ 7 కోట్లు జప్తు


హీరోయిన్ జాక్వెలిన్ కి చెందిన 7 కోట్ల రూపాయలను జప్తు చేసింది ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్). కుంభకోణాలు, మోసాలు చేసే సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యాపారవేత్తతో ఆమె కొంతకాలం డేటింగ్ చేసింది. ఆ సమయంలో అతను ఆమెకి ఏడు కోట్ల రూపాయల డబ్బులతో పాటు, విలువైన బహుమతులు ఇచ్చాడు.

అతని మోసాలపై విచారణ చేపట్టిన ఈడీ ఆ కేసులో భాగంగా తాజాగా జాక్వెలిన్ 7 కోట్ల బహుమతులను జప్తు చేసింది. జాక్వెలిన్ ఎకౌంట్ లో 7 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్ లను ఫ్రీజ్ చేసింది ఈడీ. కేసు విచారణ పూర్తయ్యేంతవరకు అంతే.

జాక్వెలిన్ కి కార్లు, ఆభరణాలు, ఇంకా అనేక బహుమతులు ఇచ్చాడాట. అవి కూడా 5,6 కోట్ల వ్యాల్యూ ఉంటుంది అని సమాచారం. జాక్వెలిన్ తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు కూడా అనేక బహుమతులు అందుకున్నారట.

బాలీవుడ్ లో హీరోయిన్ గా పాపులర్ అయిన జాక్వెలిన్ సొంత దేశం… శ్రీలంక. తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంలో నటించింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో మొదట ఆమెని తీసుకున్నారు. ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ఈ కేసులే కారణం.

Advertisement

This post was last modified on April 30, 2022 2:44 pm

Advertisement
Share