Advertisement
తెలుగు న్యూస్

జాన్వీ షూటింగ్ షురూ

జాన్వీ కపూర్ మొదటి తెలుగు చిత్రం జూనియర్ ఎన్టీఆర్ సరసన. గత నెలలో జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి ఈ అమ్మడు విచ్చేసింది. ఆ తర్వాత జరిగిన మొదటి షూటింగ్ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ పైనే సీన్లు తీశారు.

ఈ రోజు రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ రోజు నుంచి ఆమె షూటింగ్ లో పాల్గొంటోంది. అంటే ఆమె మొదటి తెలుగు చిత్రం మొదటి షూటింగ్ అన్నమాట.

జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఇష్టపడి నటిస్తోంది. ఎన్టీఆర్ తన ఫెవరేట్ నటుడు అని ఆ మధ్య చెప్పింది. ఇక పాన్ ఇండియా పరంగా క్రేజ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ సినిమా మేకర్స్ కూడా ఆమెని ఒప్పించి మరీ రప్పించారు. ఈ సినిమాలో నటించేందుకు ఈ భామ దాదాపు 5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.

ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఆయన త్వరలోనే సంతకాలు పూర్తి చేస్తారట. ఆ తర్వాత ఆయన కూడా షూటింగ్ లో పాల్గొంటారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

This post was last modified on April 17, 2023 10:42 pm

Advertisement
Share