Advertisement


కీర్తి సురేష్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే, ఇప్పటివరకు ఆమెని ఎక్కువగా ఇన్ స్టాగ్రాంలోనే ఫాలో అయ్యేవారు నెట్ జనం. ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఆమెకి క్రేజ్ పెరుగుతోంది.

తాజాగా ఆమె ట్విట్టర్లో 5 మిలియన్ల (50 లక్షల) ఫాలోవర్స్ ని పొందింది. ట్విట్టర్లో ఆమె ఎక్కువగా తన సినిమాలకు సంబంధించిన ట్రయిలర్లు షేర్ చెయ్యడం, సెలబ్రిటీలకు గ్రీటింగ్లు చెప్పడం వరకు పరిమితం అవుతుంది. ఇక, ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ అమ్మడు ఇటీవల గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో కిరాక్ పుట్టిస్తోంది. అందుకే కాబోలు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది.

కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘దసరా’ సినిమాలో నటిస్తోంది.

Advertisement

This post was last modified on July 24, 2022 7:32 pm

Advertisement
Share