Advertisement
తెలుగు న్యూస్

ఉప్పెన డేట్ కోసం క్రిష్ వెయిటింగ్

“ఉప్పెన” అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని దాదాపు ఏడాది కావొస్తోంది. లాక్డౌన్ టైములో ఎన్ని చిన్న సినిమాలు ఒటిటిలో విడుదలయ్యాయి. కానీ “ఉప్పెన” మేకర్స్ మాత్రం డిజిటల్ డైరెక్ట్ రిలీజ్ కి ఒప్పుకోలేదు. ఎందుకంటే… ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే. రెండోది.. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తొలి సినిమాతోనే OTT బాట పడితే … సామాన్య జనంలో గుర్తింపు రావడం కష్టం అవుతుందని జంకుతున్నారు.

ఇప్పుడు థియేటర్లు మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. ధైర్యం చేసి సంక్రాంతికి దీన్ని విడుదల చెయ్యొచ్చు. కానీ ఆ విషయంలో ఉప్పెన మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సినిమాలో పాటలు బాగానే పాపులర్ అయ్యాయి. ఈ పాట ఇన్ని మిలియన్ల వ్యూస్ దక్కించుకొంది, ఆ పాటకి ఇన్ని రికార్డ్ వ్యూస్ వచ్చాయి అని రెండో వారాలకోసారి పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప సినిమా రిలీజ్ గురించి ఊసెత్తడం లేదు నిర్మాతలు.

సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాకి కూడా ఇలాంటి సమ్యసలు వచ్చాయి. “రేయ్” అనే సినిమాతో అడుగుపెట్టాడు సాయి ధరమ్ తేజ్. కానీ ఆ సినిమా రిలీజ్ కి అనేక కష్టాలు పడింది. ఆ లోపు రెండో సినిమా పూర్తి చేశాడు సాయి తేజ్. ఇప్పుడు ఆయన తమ్ముడు కూడా మొదటి సినిమా విడుదల అయ్యేలోపే రెండో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాడు. క్రిష్ డైరెక్క్షన్లో రూపొందిన ఒక కొత్త చిన్న సినిమాలో అతనే హీరో. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. షూటింగ్ మొత్తం పూర్తి అయింది.

“ఉప్పెన” రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తే క్రిష్ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ వివరాలు తెలుస్తాయి.

Advertisement

This post was last modified on December 12, 2020 6:15 pm

Advertisement
Share