Advertisement
తెలుగు న్యూస్

పుకార్లపై ఫీలవుతోన్న కృతి


కృతి శెట్టి తక్కువ టైంలోనే పాపులర్ అయింది. వరుసగా మూడు విజయాలు అందుకోవడం అంటే మాటలు కాదు. తొలి చిత్రం ‘ఉప్పెన’ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు మోస్తరు విజయాలుగా నిలిచాయి.

ఇప్పుడు రిలీజ్ కి మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఐతే, విజయాలతో పాటు ఆమెకి టెక్కు కూడా పెరిగిందనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిర్మాతలను, దర్శకులను సతాయిస్తోంది అనే పుకార్లు మొదలయ్యాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఒక సినిమా సెట్ లో ఆ దర్శకుడిని బాగా సతాయించినట్లుగా కొన్ని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. లొకేషన్ కి టైం రాకపోవడం, సెట్ కి వచ్చిన తర్వాత గంటల తరబడి వానిటీ వ్యాన్ నుంచి బయటికి రాకుండా ఉంటూ ఆ దర్శకుడికి చికాకు తెప్పించిందట. ఈ పుకార్లతో ఈ బ్యూటీ షాక్ తిన్నది.

కావాలనే తనపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని అంటోంది. కానీ, కృతిపై పుకార్లు పుట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?

సుధీర్ బాబు హీరోగా, కృతి హీరోయిన్ గా నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది వారియర్’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా హిట్టయితే ఆమె టాప్ లీగ్ లోకి వెళ్తుంది. ఐతే, విజయాలు వచ్చినప్పుడే గ్రౌండెడ్ గా ఉండాలి.

Advertisement

This post was last modified on February 19, 2022 5:34 pm

Advertisement
Share