Advertisement

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ అప్పట్లో ఒక బాక్సాఫీస్ సంచలనం. ఆ సినిమా ఇటీవల 4కేలో మళ్ళీ విడుదలైంది థియేటర్లలో. అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ కి వెళ్లి చూశారు. రీరిలీజ్ లో కూడా రికార్డులు సృష్టించింది ‘ఖుషి’. ఇప్పటివరకు విడుదలైన ‘రీ రిలీజ్’ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీ అదే.

తాజాగా ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ మళ్ళీ విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఐతే ఈ సినిమా ఖుషి రికార్డులను బద్దలు కొట్టలేకపోయింది. ‘సింహాద్రి’ చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పొందింది. కానీ, పవన్ కళ్యాణ్ చిత్రం దరిదాపుల్లో లేదు.

మరోవైపు, ‘సింహాద్రి’ అమెరికాలో మంచి వసూళ్లు పొందింది.

‘సింహాద్రి’ అప్పట్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో విడుదలైన మూవీ. రాజమౌళికి మొదటి బిగ్ బ్లాక్ బస్టర్. ఐతే, ఇప్పుడు అభిమానులను పెద్దగా రప్పించలేకపోయింది. ఆ మాటకొస్తే ‘మగధీర’కు ముందు రాజమౌళి తీసిన సినిమాలకు ఇప్పుడు పెద్దగా వ్యాల్యూ లేదు. ఈ మధ్య ‘ఛత్రపతి’ సినిమా హిందీలో రీమేక్ తీస్తే ‘క్రింజ్’ అంటూ ఈసడించుకున్నారు హిందీ జనం.

Advertisement

This post was last modified on May 21, 2023 1:10 pm

Advertisement
Share