Advertisement
తెలుగు న్యూస్

ఇన్నాళ్ళకి మడోన్నాకి ఒక ఆఫర్

నాలుగేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన “ప్రేమమ్” సినిమా గుర్తుందా? నాగ చైతన్య హీరోగా నటించిన ఆ సినిమాలో శృతి హాసన్, అనుపమతో పాటు మడోన్నా అనే కేరళ కుట్టి కూడా నటించింది. ఆ సినిమా విజయం సాధించినా…ఎందుకో మడోన్నాకి మళ్లీ తెలుగులో మరో సినిమా దక్కలేదు.

లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె రెండో తెలుగు సినిమా సైన్ చేసింది. నాని హీరోగా ఈ రోజు లాంచ్ అయిన “శ్యామ్ సింగ రాయ్” అనే సినిమాతో ఆమె టాలీవుడ్ లో రి-ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మెయిన్ హీరోయిన్స్ సాయి పల్లవి, కృతి శెట్టి. మూడో భామగా మడోన్నా నటిస్తోంది.

నిజానికి ఈ పాత్రకి మొదట నివేధా థామస్ కానీ, అదితి రావుని కానీ తీసుకుందామని అనుకున్నారు. ఫ్రెష్ లుక్ రావాలంటే ఇంతకుముందు నానితో నటించని భామని తీసుకోవాలనే ఆలోచనతో మడోన్నాకి ఛాన్స్ దక్కింది.

మడోన్నా మలయాళంలో రెగ్యులర్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో పాపులర్. రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఇన్ స్టాగ్రామ్ లో.

Advertisement

This post was last modified on December 10, 2020 2:02 pm

Advertisement
Share