Advertisement
తెలుగు న్యూస్

పైడిపల్లితో మళ్ళీ మూవీ ఉంటుందా?

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి మళ్ళీ పార్టీ చేసుకున్న ఫోటో బాగా వైరల్ అయింది. నిన్న రాత్రి మహేష్ బాబు, మరికొంత మంది స్నేహితులు డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు. అందులో వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. ఆ ఫోటోని నమ్రత షేర్ చేశారు. దాంతో మహేష్, పైడిపల్లి కాంబినేషన్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది.

“మహర్షి” సినిమా విడుదలైన వెంటనే పైడిపల్లి డైరెక్షన్లోనే మరో సినిమా చేస్తాను అని మమహేష్ బాబు ప్రకటించాడు. దాంతో వంశీ ఏడాది పాటు తన రైటర్ల టీంతో సిట్టింగ్ వేసి ఒక కథ రెడీ చేసి మహేష్ కి వినిపించాడు. ఆ లైన్ కి మహేష్ ఓకే చెప్పాడు. ఐతే, “సరిలేరు నీకెవ్వరు” సినిమా రిలీజ్ అయిన వెంటనే మహేష్ బాబు మరోసారి ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ విన్నాడు. అప్పుడు నో చెప్పాడు. పైడిపల్లి కథలో పస లేదని భావించాడు మహేష్. ఆలా పైడిపల్లి మూవీ ఆగిపోయింది.

ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కి మరో కథ చెప్పి ఫార్మల్ గా ఓకే చేయించుకున్నాడు పైడిపల్లి. కానీ దాని అనౌన్సుమెంట్ ఇంకా రాలేదు. ఈ గ్యాప్ లో మరోసారి మహేష్, పైడిపల్లి పార్టీ చేసుకోవడంతో మళ్ళీ సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.

Advertisement

This post was last modified on December 11, 2020 2:40 pm

Advertisement
Share