Advertisement
తెలుగు న్యూస్

మహేష్ బాబుకి ఇక తీరిక ఉండదు!


‘సర్కారు వారి పాట’ సినిమా వాయిదా పడింది. ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1 విడుదల తేదీ నుంచి తప్పుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి టీం ‘ఆచార్య’ విడుదల తేదీని ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 1 విడుదల అంటూ ‘ఆచార్య’ రానుంది.

మరి, మహేష్ బాబు సినిమాకి కొత్త డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 27/28న వస్తుందా? లేదా ‘మహర్షి’ విడుదలైనట్లు మే రెండో వారంలో రిలీజ్ అవుతుందా? దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరో 40 రోజుల షూటింగ్ మిగిలే ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమా విడుదల ఎంత లేట్ ఐతే దర్శకుడు త్రివిక్రమ్ అంత టెన్షన్. ఎందుకంటే… మహేష్ బాబు – త్రివిక్రమ్ కొత్త సినిమా షూటింగ్ అంత ఆలస్యం అవుతుంది.

మరో వైపు, మహేష్ బాబుకి కూడా కష్టమే. రాజమౌళి సినిమాకి డేట్స్ ఇవ్వాలి, త్రివిక్రమ్ సినిమా పూర్తి చెయ్యాలి. సో, మహేష్ బాబుకి ఈ ఏడాది టైట్ షెడ్యూల్ ఉంటుంది. ఇటీవల మహేష్ బాబు బాగా రిలాక్స్ అయ్యారు. ఎక్కువగా వెకేషన్ కి వెళ్తున్నారు. తాపీగా షూటింగ్ చేస్తున్నారు. కానీ, కరోనా కారణంగా ఆయన షెడ్యూలు అంతా తారుమారు అయింది. ఇకపై నాన్ స్టాప్ గా షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది.

‘సర్కారు వారి పాట’ పూర్తి చేసి, ఆ వెంటనే త్రివిక్రమ్ మూవీ మొదలు పెట్టాలి. త్రివిక్రమ్ చిత్రం షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేసి… రాజమౌళి మూవీ షురూ చెయ్యాలి. అంటే, మహేష్ బాబుకి ఇక తీరిక ఉండదు.

Advertisement

This post was last modified on January 16, 2022 12:06 pm

Advertisement
Share