Advertisement
తెలుగు న్యూస్

ఏడాది తర్వాతే షూటింగ్


మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది (2022) అది జరగదు. “ఆర్ ఆర్ ఆర్” ఈ నెలాఖరులో విడుదల అవుతోంది. అంటే వచ్చే నెల నుంచి రాజమౌళి ఫ్రీ అవుతారు. కానీ, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని… స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తారట. ఆ తర్వాత మహేష్ బాబు ఎప్పుడు డేట్స్ ఇవ్వగలడో తెలుసుకొని తన సినిమా షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటారట.

ఇదంతా సెట్ కావాలంటే ఏడాది పైనే పడుతుంది. అందుకే, రాజమౌళి తన కెమెరామన్ సెంథిల్ ని వేరే సినిమా చేసుకోమని పంపించారు. మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్… ఇలా వరుసగా రాజమౌళి సినిమాలకు కెమెరా వర్క్ అందిస్తూ వస్తున్నారు సెంథిల్ కుమార్. సినిమాకి, సినిమాకి మధ్య రాజమౌళి ఏడాది విశ్రాంతి తీసుకుంటారు. ఆ టైంలో మాత్రమే సెంథిల్ ఎదో ఒక చిన్న సినిమాని ఒప్పుకుంటారు.

ఇప్పుడు తాజాగా సెంథిల్ ఒక కన్నడ – తెలుగు చిత్రం టేకప్ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు మొదటి సినిమాకి అతనే కెమెరామెన్. మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఈ ఏడాది మొదలు కాదనే ఉద్దేశంతోనే ఆయన ఆ మూవీ ఒప్పుకున్నారు అనేది అర్థమవుతోంది.

మహేష్ బాబు కూడా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా మొదలుపెడుతారు. ఇదంతా అవ్వడానికి ఏడాది పడుతుంది. సో, రాజమౌళి – మహేష్ బాబు మూవీ 2023లో మొదలవుతుంది. మరి 2024లో విడుదల అవుతుందా లేదా 2025లోనా అన్నది ఇప్పుడే చెప్పలేం.

Advertisement

This post was last modified on March 5, 2022 11:10 pm

Advertisement
Share