Advertisement
తెలుగు న్యూస్

ఫిమేల్ ప్రవరాఖ్య అనేవారట!


కొందరు పాత తరం హీరోలు, హీరోయిన్లు తమ పాత ప్రణయ సంబంధాల గురించి ఇప్పటి తరం వాళ్ళకి తెలియదనుకుంటారు కాబోలు. మీనాక్షి శేషాద్రి తాజా ఇంటర్వ్యూ చూస్తే అదే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని అమెరికాలోని డల్లాస్ లో స్థిరపడ్డారు. ఆమెకిద్దరు పిల్లలు.

పెళ్ళైన 26 ఏళ్ల తర్వాత మళ్ళీ నటించేందుకు రెడీ అంటున్నారు మీనాక్షి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పట్లో తనకి ఎవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పుకోవడం విశేషం. “అప్పట్లో నన్ను అందరూ ఐస్ మైడెన్ (ఆడ ప్రవరాఖ్య) అనేవారు. ఎందుకంటే నాకు అప్పుడు బాయ్ ఫ్రెండ్స్ లేరు, అఫైర్లు లేవు,” అని తెలిపారు.

ఆ తరం జర్నలిస్టులు, ఫిలిం సెలెబ్రిటీస్ ని ఎవరిని అడిగినా చెప్తారు… ఆమె తాజాగా చెప్పినదాంట్లో నిజం లేదని.

1980, 90లలో మీనాక్షి శేషాద్రి బాలీవుడ్ లో సంచలన హీరోయిన్. ఆమె దక్షిణాదికి చెందిన వారే కానీ కెరీర్ అంతా బాలీవుడ్ లోనే సాగింది. ఆమె అందచందాలకు, అభినయానికి అప్పుడు దేశంలో అందరూ ఫిదా అయ్యారు. బాలీవుడ్ లో హీరో, సహేన్ షా, ఘాయల్, దామిని వంటి సంచలన హిట్ చిత్రాల్లో నటించారు.

ఎన్టీ రామారావు ఆమెని ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’తో తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆపద్బాంధవుడు’లో, తమిళంలో ‘డ్యూయెట్’లో కూడా నటించారు మీనాక్షి శేషాద్రి.

Advertisement

This post was last modified on June 20, 2021 12:39 pm

Advertisement
Share