Advertisement
తెలుగు న్యూస్

చరణ్ నిర్మాత, నిఖిల్ హీరో!


హీరో రామ్ చరణ్ తన మిత్రుడు విక్రమ్ రెడ్డితో కలిసి ఒక కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఆ బ్యానర్ పేరు… వి మెగా పిక్చర్స్. ఈ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రంలో నటించే హీరో ఎవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్.

ఈ హీరో ఇటీవల ‘కార్తీకేయ 2’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. దాంతో, “వి మెగా పిక్చర్స్” సంస్థ అతనితో పాన్ ఇండియా సినిమా తీస్తోంది. నిఖిల్ సిద్ధార్థ్ ఇలా ఒక పెద్ద హీరో నిర్మించే సినిమాలో నటిస్తుండడం విశేషం.

‘జాతీయ భావాలున్న’ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ పెంచుకోవాలనేది నిఖిల్ ప్లాన్. అదే పద్దతిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం, దాని వెనుకున్న మిస్టరీ చుట్టూ తిరిగే కథతో ‘స్పై’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా కూడా పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే కథాంశంతోనే రూపొందుతుంది.

రామ్ చరణ్ కూడా తన కుటుంబ హీరోలతో కాకుండా బయటి హీరోలతో సినిమాలు నిర్మించాలనుకోవడం మంచి నిర్ణయమే.

Advertisement

This post was last modified on May 27, 2023 10:13 pm

Advertisement
Share