Advertisement
తెలుగు న్యూస్

డైరెక్ట్ రిలీజా? థియేటర్లోనా?


ఏపీలో వచ్చే నెలలో లాక్డౌన్ ఎత్తేసే అవకాశం ఉంది. తెలంగాణాలో ఇప్పటికే పూర్తిగా అన్ లాక్ ఉంది. ఇక థియేటర్లలో సినిమాలు విడుదలకు ఏ అడ్డంకి లేదు. కాకపోతే పరిస్థితులు ఇంకా కుదుటపడాలి. మూడో వేవ్ కనుక విరుచుకుపడకపోతే, రెండు నెలల్లో అంతా సర్దుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటప్పుడు ఏ హీరో అయినా తన సినిమాని ఓటిటి వేదికపై డైరెక్ట్ గా విడుదల చేయాలనుకుంటారా?

కానీ నితిన్ నటించిన ‘మేస్ట్రో’ సినిమా విషయంలో ఈ మాట వినిపిస్తోంది. నితిన్ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు థియేటర్లో విడుదల చేశారు. ‘చెక్’ దారుణ పరాజయం పాలైంది. ‘రంగ్ దే’ గుడ్డిలో మెల్ల. ఇది కూడా నిరాశపరించింది. కానీ ‘చెక్’దే కొంత బెటర్. ఇలా రెండు నిరాశజనకమైన ఫలితాల తర్వాత మూడో సినిమాని థియేటర్లో విడుదల చేస్తే ఓపెనింగ్ ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు నితిన్ ని వెంటాడుతున్నాయి.

అందుకే, ‘మేస్ట్రో’ సినిమాని డైరెక్ట్ గా ఓటిటీలో విడుదల చేద్దామని ఆలోచనకు వచ్చాడట. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయింది. కానీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సులున్నాయి.

ఇది హిందీలో సూపర్ హిట్టయిన ‘అంధధూన్’ అనే సినిమాకి రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకుడు. తమన్న విలన్ గా నటిస్తుండడం విశేషం.

Advertisement

This post was last modified on June 21, 2021 1:06 pm

Advertisement
Share