Advertisement
తెలుగు న్యూస్

నా నిర్ణయాల వెనుకున్నది వాళ్లే!

‘మత్తు వదలరా’తో హీరోగా అడుగుపెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా రూపొందిన రెండో మూవీ…"తెల్లవారితే గురువారం“. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుద‌ల కానుంది.

ఆదివారం (మార్చి 21న) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

“నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు రావడం లేదు. రేపొద్దున భార్గవ్, అభయ్‌ ల సక్సెస్ ను చూసి కూడా ఇంతే సంబరపడతానేమో. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ నిర్ణయం వెనక వాళ్లు ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కాను,” అంటూ ఎన్టీఆర్ కీరవాణి, రాజమౌళి కుటుంబాలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

“మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ చెయ్యాలి. సింహా, భైరవ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా వళ్లమ్మ, రమమ్మ. ప్రతి కొడుకు సక్సెస్ వెనకా ఓ తల్లి ఉంటుంది.. మా పిల్లలకు ఉదాహరణగా చెప్పుకునేందుకు వీళ్లున్నారు. సింహా, భైరవకు సినిమాల పరంగానే విజయాలు కాకుండా రేపు వచ్చే యువతకు ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నాను,” అన్నారు ఎన్టీఆర్.

Advertisement

This post was last modified on March 21, 2021 9:38 pm

Advertisement
Share