Advertisement
తెలుగు న్యూస్

ఎన్టీఆర్ ఆట మొదలైంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు. ఎన్టీఆర్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడం కొత్త కాదు. ‘బిగ్ బాస్’ తెలుగు మొదటి సీజన్ లో ఎన్టీఆర్ ఎలా రెచ్చిపోయారో చూశాం. ఆ షో అంత పాపులర్ కావడానికి కారణం ఎన్టీఆరే.

ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా దర్శనమిస్తున్నారు. జెమినీ టీవీలో ప్రసారం అయ్యే ఈ షో షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందిట.

ఇది హిందీలో బాగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు వర్షన్ అని చెప్పక్కర్లేదు. ఇంతకుముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మా టీవీ కొన్నాళ్ళు ఆ షో నడిపింది. నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. కానీ రేటింగ్స్ రావడం లేదని నిలిపివేశారు.

ఇప్పుడు జెమినీ టీవీ ఆ హక్కులు తీసుకొని కొత్త పద్దతిలో స్టార్ట్ చేస్తోంది. ఈ షో కోసం ఎన్టీఆర్ దాదాపు 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. బుల్లితెరపై మరోసారి ఎన్టీఆర్ ఆట షురూ.

Advertisement

This post was last modified on July 10, 2021 10:40 am

Advertisement
Share