Advertisement
తెలుగు న్యూస్

ఎన్టీఆర్ 25 లక్షల విరాళం


ఆంధ్రపదేశ్ లో ఇటీవల భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కనీవినీ ఎరుగని వరద బీభత్సాన్ని చూశాయి. అనేక గ్రామాల్లో ఇంకా వరదనీరు ఉంది. సామాన్యులు కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయంగా 25 లక్షల విరాళం ప్రకటించారు.

వరద ప్రాంత బాధితులకు సాయం అందేలా ఈ డొనేషన్ ఇస్తున్నట్లు తెలిపారు ఎన్టీఆర్.

తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆపద వచ్చినా సాయం చేసేందుకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలెబ్రిటీలు ముందుంటారు. హైదరాబాద్ వరదలు, హుదుహుద్ తుపాను… ఇలా అన్ని సందర్భాల్లో మన హీరోలు తమ వంతు సాయం అందించారు. ఎన్టీఆర్ ఈ సారి మిగతా వారికన్నా ముందు ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement

This post was last modified on December 1, 2021 5:38 pm

Advertisement
Share