Advertisement
తెలుగు న్యూస్

దర్శనం మొగిలయ్యకి పద్మశ్రీ


2022 రిపబ్లిక్ డేని పురస్కరించుకొని పద్మ అవార్డులని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మ పురస్కారాలు దక్కాయి.

మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్లని పద్మభూషణ్ తో సత్కరించనున్నారు. అలాగే కరోనా టీకా తయారు చేసిన హైదరాబాద్ కి చెందిన భారత్‌ బయోటెక్‌ అధినేతలు డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకి కూడా పద్మభూషణ్ అవార్డు వరించింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి.

12 మెట్ల కిన్నెర వాయిద్యంపై సంగీతం పలికించే దర్శనం మొగిలయ్య ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమాలో పాట కూడా పాడారు.

Advertisement

This post was last modified on January 25, 2022 9:52 pm

Advertisement
Share