Advertisement
తెలుగు న్యూస్

ప్రశాంత్ నీల్ మూడేళ్లు ఇక్కడే!


ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మార్మోగిపోతోంది. రాజమౌళికి ఎంత క్రేజ్ వచ్చిందో నీల్ కి జాతీయస్థాయిలో అంతే పేరు వచ్చింది. హిందీలో ‘కేజీఎఫ్ 2’ ఒక సంచలనం. అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా వసూళ్లు కూడా దాటెయ్యనుంది కేజీఎఫ్ 2. ఇక తెలుగులో ఈ సినిమా ఇప్పటికే 75 కోట్ల షేర్ అందుకొంది.

ఐతే, ‘కేజీఎఫ్ 2’ విడుదల కన్నా ముందే తెలుగు హీరోలు, నిర్మాతలు అతని సత్తా ఏంటో తెలుసుకున్నారు. పెద్ద దర్శకుడు అవుతాడని గెస్ చేశారు. ఎడాపెడా అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేశారు. ఇప్పుడు వరుసగా మూడు సినిమాలు తెలుగులోనే చెయ్యాలి ప్రశాంత్ నీల్.

ప్రభాస్ హీరోగా ఇప్పటికే ‘సలార్’ తీస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మూవీ ఉంటుంది. ఈ రెండు ఫిక్స్. వీటిలో మార్పులేదు. ఎన్టీఆర్ 31 మూవీ అయిపోయాక రామ్ చరణ్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అంటే, మరో మూడు ఏళ్ళు నీల్ హైదరాబాద్ లోనే ఉండాలి. అలా నీల్ ని టాలీవుడ్ దాటి వెళ్లకుండా చేశారు మన హీరోలు, నిర్మాతలు.

అంతేకాదు, నీల్ కి పారితోషికం కూడా గట్టిగానే ముడుతోంది. సో… ఇరుపక్షాలకి లాభమే.

Advertisement

This post was last modified on May 2, 2022 10:42 pm

Advertisement
Share