మ్యూజింగ్స్ అంటూ తన మనసులో ఉన్నది ఉన్నట్టు కక్కేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పటికే అతడి మ్యూజింగ్స్ చాలా మందిని ఎట్రాక్ట్ చేయగా.. మరికొన్ని వివాదాస్పదమయ్యాయి కూడా. ఈసారి దీపావళిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు పూరి.
కిడ్నాప్డ్ వైఫ్ క్షేమంగా ఇంటికి తిరిగి రావడం వల్ల ఈ పండగ మొదలైందని తనదైన స్టయిల్ లో చెప్పుకొచ్చాడు పూరి. అంటే అతడి ఉద్దేశం.. రావణాసురుడి చెర నుంచి సీతను రాముడు విడిపించాడని అర్థం. ఇలా తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన పూరి.. దీపావళికి బాణసంచా కాల్చే కంటే మొక్కలు పెంచడం చాలా మంచిదని చెప్పుకొచ్చాడు.
This post was last modified on November 12, 2020 9:21 pm